ఈ నెల 23న భోపాల్ లో 'పెద్ది' రీసౌండ్ ఖాయం!

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లు ప్రారంభం
  • మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ ఈవెంట్
  • ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్
  • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. సినిమా ప్రమోషన్లకు ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌తో కిక్ ఇచ్చేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ మేరకు మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

'సౌండ్ ఆఫ్ పెద్ది' పేరుతో జరగనున్న ఈ ఈవెంట్‌లో భాగంగా సినిమాలోని ఒక ప్రత్యేక గీతాన్ని పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిలవనున్నారు. ఆయన ఈ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ ఈవెంట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌తో పాటు జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. భోపాల్ ఈవెంట్‌తో సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కాగా, మే 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దీంతో ఈ చిత్రం ప్రమోషన్స్ అధికారికంగా ప్రారంభం కానున్నాయి. 

Ram Charan
Peddi
Bhopal
AR Rahman
Janhvi Kapoor
Buchi Babu Sana
Sound of Peddi
Telugu movie
Shivrajkumar
Mythri Movie Makers

More Telugu News